శ్రీకాకుళం జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడుకు రాష్ట్ర డిగ్రీ కళాశాలల సంఘ ప్రతినిధులు గురువారం ఢిల్లీలో వినతిపత్రం అంద జేశారు. ఏజీసీటీఈలో ఉన్న సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ ఎంపీ భరత్ను కలిశారు. మంత్రిని కలిసిన వారిలో సంఘ నాయకులు కోత మురళీధర్, పొన్నాడ జయరాం, బొంతు శ్రీనివాస్, గుండారెడ్డి, వెంకటరెడ్డి, విజయభాస్కర్, సుబ్బారెడ్డి, రామన్జీ తదితరులు ఉన్నారు. అనంతరం ఎంపీని దుశ్శాలువతో సత్కరించారు.