ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 28న పదవీబాధ్యతలు చేపట్టనున్న పల్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 06:47 PM

ఈనెల 28న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవాహం మధ్యాహ్నం 01:45గంటలకు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు నాయకులు హాజరుకానున్నారు. గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేయడంతో గుర్తించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. జూన్ 16న పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com