ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారతీయులు మోజుపడి కొంటున్న 7 సీటర్ కారు ఇదే

business |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 05:51 PM

సొంత ఇల్లు, అందులో కారు ఉండాలని సగటి భారతీయుడి కల. ఇటీవలి కాలంలో కారు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరిగింది. అలాగే కుటుంబం మొత్తానికి సరిపోయేలా పెద్ద కార్లపైనే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 7 సీటర్ కార్లకు మంచి డిమాండ్ ఉంటోంది. మన దేశంలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా వంటి దిగ్గజ కంపెనీలు కార్ల విక్రయాలు చేపడుతున్నాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అయితే, 7 సీటర్ వేరియంట్‌లో ఓ కారును భారతీయులు మోజపడి కొంటున్నారు. ఈ ఏడాది మే, 2024లో అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కార్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదే మారుతీ సుజుకీ ఎర్టిగా 


మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఎర్టిగా మోడల్ అత్యధికంగా సేల్స్ జరిగాయి. ఈ మోడల్ గత మే, 2024 నెలలో ఏకంగా 13,893 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన 7 సీటర్ కారు గా నిలిచింది. 7 సీటర్ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీలు పోటీలో వెనకబడ్డాయని చెప్పవచ్చు. మరి ఈ కారు ధర ఎంత? ఎలాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


మారుతీ సుజుకీ ఎర్టిగా ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 13.03 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ కారు LXi, VXi, ZXi, ZXi+ వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. అలాగే పెర్ల్ మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ ఆర్కిటిక్ వైట్, డిగ్నిటీ బ్రౌన్, మెటాలిక్ మగ్మా గ్రే, పర్ల్ మెటాలిక్ ఆబర్న్ రెడ్, సిల్వర్, పర్ల్ మెటాలిక్ ఆక్స్ ఫర్డ్ బ్లూ వంటి కలర్లలో లభిస్తోంది.


5 స్పీమ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు లభిస్తోంది. అలాగే 103 పీఎస్, 137 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే సీఎన్‌జీపై 88పీఎస్, 121.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే, సీఎన్‌డీ వేరియంట్‌లో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. 7 ఇంచుల టచ్ స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఏసీ, పాడిల్ షిఫ్టర్ల వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్, పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటివి ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com