ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఎయిర్‌పోర్టులో ఆ సేవలు తిరిగి ప్రారంభం.. ఇక దేశంలో ఎక్కడికైనా గంటల వ్యవధిలోనే.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 30, 2024, 08:06 PM

ఏపీలో విమాన ప్రయాణాలు సాగించేవారికి విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. ఎయిర్ పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు విమానాశ్రయ డైరక్టర్ లక్ష్మీకాంత రెడ్డి వెల్లడించారు. జులై 1ను ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. 2021లోనే విజయవాడ ఎయిర్‌పోర్టులో కార్గో సేవలు ప్రారంభించారు. అయితే కరోనా కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి.


ప్రస్తుతం పరిస్థితి సద్దుమణగడంతో తిరిగి కార్గో సేవలను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జులై 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒమేగా ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థ ఈ సేవల టెండర్‌ను దక్కించుకుంది. ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తులైన చేప, రొయ్యలతోపాటు మిర్చి, పూలు, పండ్లు వంటి ఉత్పత్తులను దేశంలోని ఏ ప్రాంతానికైనా తరలించవచ్చు. తక్కువ ధరలలో గంటల వ్యవధిలో వాటిని గమ్యస్థానాలకు చేర్చేందుకు కార్గో సర్వీసు ఉపయోగపడనుంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ కార్గో సర్వీసు నడిపేందుకు కస్టమ్స్‌ అధికారులతో చర్చిస్తున్నట్లు లక్ష్మీకాంతరెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com