ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్‌కు సెక్యూరిటీ పెంపు.. Y ప్లస్‌తో ఎస్కార్ట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ కారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 08:17 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. అక్కడి నుంచి అమరావతికి వెళ్లనున్నారు.. ఆయనకు సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేశారు. పవన్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు. రెండో బ్లాక్‌లోని తనకు కేటాయించిన ఛాంబర్‌ను పరిశీలిస్తారు. పవన్ ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన ఛాంబర్‌లో బాధ్యతలు తీసుకుంటారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీగా పాటుగా ఎస్కార్ట్ వాహనం.. బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు సమాచారం.


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్‌ కార్యాలయంగా.. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌ను ప్రభుత్వం కేటాయించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్‌ను విశాలంగా నిర్మించారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్ హౌస్‌ను కేటాయించారు. అమరావతిలోని సచివాలయంలో.. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్‌లో ఉండేది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో పాటుగా జనసేన పార్టీ మంత్రులకు రెండో బ్లాక్‌లో ఛాంబర్లు కేటాయించారు.


పవన్‌తో పాటుగా నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేష్‌కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు. ఈ బ్లాక్‌ గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పేషీని ఇప్పటికే పురపాలకశాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్‌ దగ్గర ఉండటంతో.. పవన్‌ పేషీలు రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని కేటాయించినట్లు తెలుస్తోంది. పవన్ బుధవారం బాధ్యతలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com