శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం గొల్ల మరనపల్లికి చెందిన చిక్కన్న కుమారుడు రంగనాథ్ ( 25) విషపు ద్రవణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్ణాటకలోని సిరా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రంగనాథ్ కుటుంబ సభ్యులు తెలియదా మేరకు ఎస్సై జనార్ధన్ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు.