ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆపరేటర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 02:01 PM

కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో గౌతమినగర్‌లో నివాసముండే ప్రకాష్‌ నాయక్‌(39) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈయన బోర్‌వెల్‌ బండికి ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా బెట్టింగ్‌లు ఆడడం, లోన్‌ యాప్స్‌లో లోన్లు తీసుకోవడంతో అప్పులు పెరిగాయి. కొద్ది కాలం కింద వెల్డింగ్‌ షాపు పెట్టి నష్టాలు చవి చూశాడు. దీంతో అప్పు తీర్చలేక ఆయన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సరళా బాయి, ఒక కొడుకు, కూతురు సంతానం ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com