దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. కొద్దిసేపటికే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 7 గంటల సమయానికి 60.96 శాతం ఓటింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.త్రిపురలో ఒక లోక్సభ స్థానానికి ఎన్నికలు జరిగాయి, అత్యధికంగా 77.93 శాతం ఓటింగ్ నమోదైంది. ఛత్తీస్గఢ్లో 72.13 శాతం, పశ్చిమ బెంగాల్లో 71.84 శాతం, మహారాష్ట్రలో 53.51 శాతం ఓటింగ్ నమోదైంది.బీహార్లో మొదటి దశ కంటే రెండో దశ పోలింగ్ ఎక్కువగా నమోదైంది. బీహార్లోని 5 లోక్సభ స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరగగా 53.03 శాతం పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో సాయంత్రం 5 గంటల సమయానికి 52.74 శాతం ఓటింగ్ నమోదైంది.రాజస్థాన్లోని 13 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగ్గా, సాయంత్రం 5 గంటల సమయానికి 59.19 శాతం ఓటింగ్ జరిగింది. కర్ణాటకలోని 14 స్థానాలకు పోలింగ్ జరగగా సాయంత్రం 5 గంటల వరకు 63.9 శాతం ఓటింగ్ నమోదైంది.