ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 08:07 PM

లక్షల పుస్తకాలు చదివానంటున్న పవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా అని వైయ‌స్ఆర్‌సీపీ నేత అడ‌పా శేషు సూటిగా ప్ర‌శ్నించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ....  పవన్ కల్యాణ్, జగన్ గారి దగ్గర లక్షకోట్లు ఉన్నాయంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు.  జగన్ గారి ఎన్నికల అఫడవిట్ లో ఆయన ఆస్తులు ఎంతో వివరంగా అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారి ఎన్నికల కమీిషన్ వెబ్ సైట్ లోకి వెళ్తే తెలిసిపోతుంది.జగన్ గారి ఆస్తులు ఎంతో తేటతెల్లంగా ఉంటే ప్రజలలో అయోమయం సృష్టించేందుకు చంద్రబాబు మెప్పుకోసం లక్ష కోట్లు అంటూ పిచ్చి పట్టి మాట్లాడుతున్నారు. అందర్ని ప్రశ్నించే పవన్ కి నా ప్రశ్న..ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తులు ప్రకటన ఉంటుంది చూసుకో . ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చూసి ఎన్నికల ప్రసంగాలు చదివే పవన్ కు ఈ విషయంలో స్ర్కిప్ట్ సరిగా రాసిచ్చినట్లు లేరు.అందుకే వివరం తెలియకుండా మాట్లాడుతున్నారు. 2014 లో చంద్రబాబుని పొగిడి 2019లో చంద్రబాబు,లోకేష్ ని తిట్టిన మాట నిజం కాదా. మళ్లీ నేడు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి కాపుకులాన్ని గంపగుత్తగా తాకట్టుపెట్టిన ఘనత పవన్ కల్యామ్ దే. చంద్రబాబు ఇచ్చే ప్యాకెజ్ కోసం నమ్ముకున్న కులాన్ని, జనసేన కోసం శ్రమిస్తున్న జనసైనికులని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టి 14 ఏళ్ళులో 5ఏళ్ళు ప్రతిపక్షలో ఉండి  కష్టపడి జగన్ సీఎం అయ్యాడు. రెండేళ్ళు అటు ఇటుగా జనసేనను స్దాపించిన పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండుచోట్ల ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు.  ఇప్పుడు బిజేపి,టిడిపితో కలసి వచ్చినా ప్రజలు పవన్ కల్యాణ్ ను నమ్మే పరిస్దితి లేదు. పవన్ కల్యాణ్ కు ఆదరణ తగ్గడంతో సజ్జలగారు చిరంజీవిని ఏమీ అనకపోయినా చిరంజీవిని అంటే ఊరుకోనంటూ చిరంజీవిని సైతం ఇందులోకి లాగారు. చంద్రబాబు మెప్పుకోసం చిరంజీవిని సైతం రాజకీయంగా వినియోగించుకోవాలని పవన్ కల్యాణ్ చూస్తున్నారు. పవన కల్యాణ్ కు పిఠాపురంలో ఎదురుగాలి వీస్తోంది.అందుకే పవన్ కల్యాణ్ లో ఆందోళన ప్రారంభమైంది. రాష్టంలో దమ్మున్న నాయకుడు జగన్..ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాలు,వాలంటీర్లు వంటి కొత్త సంస్కరణలు తెచ్చి దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసాడు. పార్టీ పెట్టి 14 ఏళ్ళులో 5ఏళ్ళు ప్రతిపక్షలో ఉండి  కష్టపడి జగన్ సీఎం అయ్యాడు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే జగన్ ని ఏమని ప్రశ్నిస్తావ్ పవన్. గతంలో టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతొ అవినీతి చేస్తుంటే చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేదు. కాపు రిజర్వేషన్ అంశంపై ముద్రగడ, చంద్రబాబుకి లేఖ రాస్తే అప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు. సిగ్గు,శరం లేని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మ అయ్యాడు. సిద్ధంసభలు చుస్తే పవన్ కళ్యాణ్ కి జగన్ గారికి ఉన్న ఆదరణ ఏంటో అర్ధం అవుతుంది. అన్ని పార్టీలు జత కట్టినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు.జగన్ మీద దాడి చేసేదాక మీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాపు సంఘాలు,నాయకులు అర్ధం చేసుకోండి..జగన్ వల్లనే కాపులు అభివృద్ధి చెందుతారు.అసెంబ్లీ టిక్కెట్ల పరంగా చూసినా,మంత్రివర్గంలో కేటాయించినా స్దానాలు చూసినా జగన్ గారి చిత్తశుద్ది అర్దం అవుతుంది. 2014,2019,2024 మూడో సారి పవన్ కళ్యాణ్ కి ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సిగ్గులేకుండా చిరంజీవిని పవన్ కళ్యాణ్ తెర మీదకి తీసుకువస్తున్నాడు. చిరంజీవి అంటే వైయ‌స్‌ జగన్ కి చాలా గౌరవం ఉంది. చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో కాపులకు నిధులు అధికంగా విడుదల చేయడం జరిగింది.కాపు నిధుల అంశంలో చర్చకి పవన్ కళ్యాణ్ సిద్ధమా. సంక్షేమ పథకాలతో కాపు మహిళలు  సైతం అభివృద్ధి చెందారు. వంగవీటి రంగా మరణానికి కారణం చంద్రబాబు, అలాంటి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. కాపులకి చంద్రబాబు,పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారు కాపులు గమనించాలి అని హెచ్చరించారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com