జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అమాయకులను ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయవాడ నగర మాజీ మేయర్ తాడి శకుంతల, సోష లిస్టు పార్టీ నేత లాం జయబాబు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహ న్రావు ఆరోపించారు. గాంధీనగర్లోని ప్రెస్క్లబ్లో ప్రెస్మీట్లో వారు మాట్లాడారు. ఎన్నికల్లో మైలేజ్ కోసం వడ్డేర కులానికి చెందిన మైనర్లను పోలీసులు విచారణ జరిపిన తీరు దురదృష్టకరమన్నారు. చీకట్లో రాయి ఎవరు విసిరారో తెలియకుండా, కస్టడీలో పెట్టి న్యాయస్ధానంలో హాజరుపరచకుండా వేధించడం అన్యాయమన్నారు. యువకులపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి అమాయకులైన వడ్డెర యువకులను న్యాయం చేయాలని కోరారు. ఆరోగ్యం సరిగా లేని వేముల సతీష్ వైద్య సేవలందించి క్షమాభిక్ష పెట్టాల న్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదును ఉపసంహ రించు కోవాలన్నారు. వెలంపల్లి చేసిన ఫిర్యాదుపై అనేక అనుమానాలు ఉన్నాయ న్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలన్నారు. వేముల సతీష్ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.