ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీ అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి ఓటు తమకే వేయాలని, మరింత అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఆయా పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలను వివరిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ఓటర్లను కలుస్తూ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. తప్పకుండా తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థులు కోరుతున్నారు. ఇదిలా ఉండటంతో ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగిన అభ్యర్థుల తరపున వారి కుటుంబసభ్యులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. భర్త కోసం భార్య, తండ్రి కోసం కొడుకు, అన్న కోసం తమ్ముడు ఇలా అభ్యర్థుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. తమవారికి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.