ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన పీలేరు మండలం, పొంతలచెరువు క్రాస్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని కావలిపల్లె పంచాయతీ, కురవపల్లెకు చెందిన ఎం. మనోహర్ ద్విచక్రవాహనంలో ఇంటి నుంచి బయలుదేరాడు. పొంతలచెరువు క్రాస్ వద్ద వెనుక నుంచి ట్రాక్టర్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను గాయపడ్డాడు. స్థానికులు అతన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు.