చీరాలలో నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభం కాగా పోలీసుల ఓవరాక్షన్ మొదలైంది. నామినేషన్లు స్వీకరించే ఆర్డీవో ఆఫీసు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు మూసేసి అటుగా ఎవరినీ రానీయడం లేదు. ఆ మార్గంలో బ్యాంకులు, ఆసుపత్రులు, మీడియా ఆఫీసులు ఉండగా వివిధ పనుల మీద ప్రజలు తిరుగుతుంటారు. అందరినీ పోలీసులు వెనక్కు పంపుతున్నారు. ఎక్కువ మాట్లాడితే ఆ రోడ్ లో ఉన్న సంస్థలన్నీ పది రోజులు మూసివేస్తామని ఎస్ఐ వేమన సెలవిచ్చారు.