ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సానుభూతి పొందేందుకే దాడి డ్రామాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 04:39 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కుట్రలో భాగమేనని తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్  అన్నారు. సీఎంపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందని, ప్రజల సానుభూతి పొందేందుకే ఈ డ్రామాలాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉండే అంబులెన్స్‌  ఏమైంది?.. సీఎం సభల్లోకి ఇతర మీడియాను  ఎందుకు అనుమతించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌పై దాడి జరిగినట్టు వీడియో ఎడిట్‌ చేశారని పట్టాభిరామ్‌ ఆరోపించారు. దాడి జరిగిన పది నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేశారని, పది నిమిషాల్లోనే పోస్టర్లు, బ్యానర్లు ఎలా రెడీ అయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇలాంటి డ్రామాలు అవసరమా? అని అన్నారు. జగన్‌ అద్భుతంగా నటిస్తారని.. ప్రతిసారి నటనను నిరూపించుకోవాల్సిన అసవరం లేదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com