ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్‌ జగన్‌పై రాళ్లదాడిని ఖండించిన రఘురామ,,,,ఓవైఫు ఖండిస్తూనే మరోవైపు అనుమానాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 14, 2024, 04:02 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన రాళ్లదాడిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. వైఎస్ జగన్ మీద రాళ్లదాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. అయితే ఓ వైపు ఖండిస్తున్నానంటూనే.. రఘురామకృష్ణరాజు పలు అనుమానాలు లేవనెత్తారు. రాజకీయాల్లో ఇలాంటి దాడులు ఉండకూడదనేది అందరిమాట అని చెప్పిన రఘురామ.. తాను కూడా అదే చెప్తున్నట్లు తెలిపారు. అయితే ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.


" దాడి సమయంలో కరెంట్ తీసేశారు. కరెంట్ తీగలు తగులుతాయని దీపాలు ఆర్పేశారు. లైవ్ కూడా లేదు. జగన్‌కు చిన్న గీటు తగిలింది. రక్తమేమీ కారిపోలేదు. మామూలుగా ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి గీట్లు పడుతుంటాయి. కొంచెం పెద్దగానే తగిలింది అనుకున్నా.. ఇలాంటి గీటుకు ఎవరైనా కుట్లు వేస్తారా? కన్నుకు తగలలేదు. కణితికి తగలలేదు. ఎవడైనా కొట్టాడా లేదా గ్యాప్‌లో ఆయనే గీరుకున్నాడా? ఓ ఫోటోలో మామూలుగా ఉంది. మరో ఫోటోలో కన్ను చుట్టూ కమిలినట్లుగా ఉంది. అని రఘురామ అనుమానాలు వ్యక్తం చేశారు.


ఇక దాడి జరిగిన తర్వాత కూడా జగన్ తన పర్యటనను కొనసాగించారని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. సింగ్ నగర్ నుంచి గన్నవరం వచ్చారని.. అక్కడ ఉన్న డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గాయానికి ప్యాచ్ వేశారని రఘురామ చెప్పారు. ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జగన్ చికిత్స తీసుకున్నారని రఘురామ వివరించారు. అయితే జగన్‌కు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసిన విధానంపైనా రఘురామ సెటైర్లు వేశారు. ఆ సమయంలో జగన్‌తో కలిసి డాక్టర్లు తీసుకున్న ఫోటోపైనా రఘురామ విమర్శలు చేశారు. తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పుడే నలుగురు డాక్టర్లు ఉన్నారన్న రఘురామ.. జగన్‌కు చిన్న గాయమైతే ఏకంగా 18 మంది డాక్టర్లు వచ్చారని చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటే జగన్‌పై దాడి ఘటన బూటకమనే అనుమానాలు వస్తున్నాయని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com