దేశం గర్వించదగ్గ వ్యక్తి జ్యోతిరావు పూలే అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే సేవలు అందరికి మార్గదర్శకం అన్నారు. మహాత్మాజ్యోతిరావూపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ముఖ్యఅతిధి శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డితోపాటు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవినవరత్నాల అమలు కమిటీ వైస్ ఛైర్మన్,నారాయణ మూర్తి,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్,ఏపీ శాలివాహన కుమ్మర కార్పొరేషన్ ఛైర్మన్ పురుషోత్తం,పార్టీ అధికారప్రతినిధి కాకుమాను రాజశేఖర్ లు కార్యక్రమంలో పాల్గొని పూలే బలహీనవర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను శ్లాఘించారు.