ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఈవో కి లేఖ వ్రాసిన గ్రూప్ 2 అభ్యర్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2024, 04:24 PM

 ఏపీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ఆలస్యంపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు గ్రూప్ 2 అభ్యర్థులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీలోని నిరుద్యోగులు గత అయిదు సంవత్సరాలుగా గ్రూప్- 2 ఉద్యోగాల కోసం సన్నద్దం అవుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష జరిగిందని.. నాలుగు వారాల్లో ఫలితాలు విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించిందన్నారు. ప్రిలిమినరీ ఫలితాలు విడుదల అయితే మేయిన్స్ కు సన్నద్దం కావడానికి ఎదురుచూస్తున్నామన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ ఉంటే ఎలక్షన్ కోడ్ అమలులో ఉందతీ.. ఎన్నికల కమీషన్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని ఏపీపీఎస్సీ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. అప్పటివరకు రిజల్ట్ ఇవ్వడం కుదరదంటూ అభ్యర్థులకు వాట్సాప్ మేసేజ్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాన్డాక్ట్ రూల్ నెంబర్ 22లో రిక్రూట్ మెంట్స్‌కు సంబంధించి యూపీఎస్పీ, ఏపీపీఎస్సీకి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ఎన్నికల కమిషన్ పేరిట ఫలితాలు ఆలస్యం చేస్తుండడం ఆందోళనకరంగా ఉందన్నారు. ఇలా ఫలితాలకు ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టి ప్రకటించకుండా తాత్సారం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇతర పోటీ పరీక్షలకు తాము ఎలా సిద్ధం కావాలని నిలదీశారు. అయిదు లక్షల మంది విన్నపాన్ని మన్నించి ప్రిలిమ్స్ ఫలితాలను వెంటనే విడుదల చేయించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కోరుతూగ్రూప్-2 అభ్యర్థులు లేఖ అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com