విరాళాల కోసం తెలుగుదేశం పార్టీ ఓ వెబ్ సైట్కు రూప కల్పన చేసింది. ఈ వెబ్సైట్ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు మంగళవారం ప్రారంభించారు. పార్టీ విరాళాల కోసం ఈ వెబ్సైట్ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. టీడీపీ ఫర్ ఆంధ్ర. కామ్ క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాలు సేకరిస్తారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా రూ.99,999లను ఆయన తొలి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఐటీకి ప్రాధాన్యత వచ్చిందని గుర్తు చేశారు. ఐటీకి అడ్వాన్స్గా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చిందన్నారు. భవిష్యత్కు అనుగుణంగా తెలుగు జాతిని సమాయత్తం చేశామని ఆయన వివరించారు.