ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. ఆ సేవ బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 10:36 PM

 శ్రీరామనవమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీరామనవమి ఆస్థానం జరుగనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా ఏప్రిల్17వ తేదీ సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది.


మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా బుధ‌వారం ఉదయం 9 నుంచి11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది.రాత్రి 9 నుంచి రాత్రి10 గంటల మధ్య బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు.


మరోవైపు శ్రీరామనవమి ఆస్థానం సందర్భంగా శ్రీవారి సహస్త్ర దీపాలంకారసేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు గుర్తించాలని టీటీడీ సూచించింది. ఇక శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 18న రాత్రి 8 నుంచి రాత్రి 9 గంటల మధ్య బంగారువాకిలి వద్ద ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com