టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో బీజేపీ పడింది అని బిజెపి నేత పనతల సురేష్ అన్నారు. శుక్రవారం కడప ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బద్వేలులో రోశన్నకు నాకు మధ్య తేడా చెప్పండి, ఎవరి నోట్లో మట్టి కొట్టడానికే రోశన్నకు టిక్కెట్ కేటాయించారని ప్రశ్నించారు. కడప గడ్డపై విద్యార్థి సమస్యలుపై ఉద్యమాలు చేసాం ఉద్యమం సమయంలో బేడీల తో పరీక్షలు రాశాను అని అన్నారు.