ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆరు కుటుంబాలు గురువారం ఉదయం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. వెంటనే రాత్రికి మాజీ ఎమ్మెల్యే కందుల సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారిలో సయ్యద్ కాశీంవలి, సయ్యద్ ఖాజావలి, ఫటాన్ హుస్సేన్ ఖాన్, సయ్యద్ చిన్న కాశీంవలి, సయ్యద్ పెద్ద కాశీంవలి, షేక్ మహబూబ్ బాషాలు ఉన్నారు.