ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని, మన తలరాతలు మార్చేవని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నియోజవర్గంలోని ఎ్రరగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.... ఈ రోజు ఎ్రరగుంట్ల గ్రామ పరిధిలో దాదాపుగా రెండు సచివాలయాల పరిధిలో ఉన్న గ్రామం ఇది. ఇందులో 1496 ఇళ్లు ఉన్నాయి. కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చిన తరువాత అడిగాను. ఈ గ్రామంలో సచివాలయాల వద్ద వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఎన్ని ఇళ్లు ఉన్నాయి. అందులో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎవరికి ఏ పథకం అందింది అన్నది సచివాలయం వద్ద జాబితా ఉంచాం. దాన్ని ఒకసారి పరిశీలించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి. ఎంత మంది లబ్ధిదారులున్నారో తెలుసుకునేందుకు డేటాను తెప్పించాను. ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయాన్ని గమనిస్తే చాలు..1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1391 ఇళ్లు అంటే 93.60 శాతం వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇళ్లు ఉన్నాయి. ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే రెండు సచివాలయాల పరిధిలోనే ఎంత డబ్బులు ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందిందని గమనిస్తే..సచివాలయంలో జాబితా, డేటా ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ..ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమ పథకాల ద్వారా మీ బిడ్డ బటన్నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లోకి నేరుగా వెళ్లడం..ఎక్కడా ఎవరూ లంచాలు అండటం లేదు. ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఏ కులం, ఏ మతం అని అడగడం లేదు. చివరికి ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు అక్కచెల్లెమ్మల్లో చిరునవ్వులు చూడాలని బటన్ నొక్కి మీ ఖాతాల్లోకి డబ్బులు పంపించాను. ఈ ఒక్క గ్రామంలోనే 1391 ఇళ్లకు సంబంధించి ఈ 58 నెలల్లో రూ.48,74,34,136 వివిధ పథకాల ద్వారా నేరుగా అందించాం అని తెలియజేసారు.