అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో నివసించే శివలక్ష్మి పై ఆమె భర్త దాడి చేసి గాయపరిచిన సంఘటనపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలియజేశారు. భార్యా, పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతున్న కారణంగా ప్రశ్నించిన తనపై భర్త దాడి చేశాడని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.