ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు ఎవరీ ఐసిస్-కె ఉగ్రవాదులు.. రష్యాలో ఉగ్రదాడి ఎందుకు చేశా

international |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:54 PM

ఐఎస్ఐఎస్-కె. దీని పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్. ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ ఈవెంట్‌పై ఈ ఐసిస్-కె ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 60 మందికిపైగా మృత్యువాత పడగా.. దాదాపు 145 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ దాడి గత దశాబ్ద కాలంలో రష్యా గడ్డపై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా అభివర్ణిస్తున్నారు. మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న థియేటర్‌ లోపలికి చొరబడిన ఐసిస్-కె ఉగ్రవాదులు.. ఆటోమేటిక్ ఆయుధాలతో అక్కడ ఉన్న వారిపై విరుచుకుపడ్డారు. కనికరం లేకుండా కాల్పులు జరపడంతో అక్కడికి వచ్చినవారు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన 2004 బెస్లాన్ పాఠశాల ముట్టడిని గుర్తు చేస్తుందని స్థానికులు చెబుతున్నారు.


అసలు ఈ ఐసిస్-కె ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైంది?


ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్-ఐసిస్ కె అనే ఉగ్రసంస్థ 2014లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో మొదలైంది. ఇస్లామిక్ స్టేట్-ఐసిస్‌ మిలిటెంట్ గ్రూప్‌కు అనుబంధంగా ఇది ఏర్పాటైంది. ప్రస్తుతం ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి గతంలో పిలిచే ఖొరాసన్ అనే పేరుతో ఈ ఉగ్రవాద సంస్థకు పేరు పెట్టారు. అయితే ఐసిస్-కె చేసే అరాచకాలు, విధ్వంసం కారణంగా అది ఎంత భయంకరమైన ఉగ్రవాద సంస్థనో ప్రపంచానికి తెలిసింది. తాలిబన్, అమెరికా దళాల చేసిన వ్యూహాత్మక ఆపరేషన్లతో 2018 నుంచి ఈ ఐసిస్-కె ప్రభావం తగ్గుతూ వచ్చింది. కానీ ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై ఈ సంస్థ ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. ఇక 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో మళ్లీ ఐసిస్-కె పుంజుకుంది.


గతంలో ఐసిస్-కె ఏ దాడులు చేసింది?


ఐసిస్-కె ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తూ ఉంటుంది. మసీదుల వద్ద భారీ బాంబు పేలుళ్లు, తుపాకులతో విధ్వంసం చేయడం ఐసిస్-కె ప్రాథమిక లక్షణం. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయంపై చేసిన ఘోర ఉగ్రదాడి.. 2021లో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై దాడి ఉన్నా చేయడంతో ఐసిస్-కె ఉనికి ప్రపంచానికి తెలిసింది. ఈ దాడుల్లో అమెరికన్ దళాలతో పాటు అనేక మంది ఆఫ్ఘనిస్థాన్ పౌరులు, సైన్యం ప్రాణాలు కోల్పోయింది.


ప్రస్తుతం రష్యాపై ఎందుకు దాడి చేసింది?


గత కొంత కాలంగా రష్యా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్ల ఐసిస్-కె తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మాస్కోలోని మ్యూజిక్ కన్సర్ట్‌పై భీకర ఉగ్రదాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్ దేశాలు.. మరీ ముఖ్యంగా సిరియాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న సైనిక జోక్యమే ప్రస్తుత దాడికి కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ ప్రభుత్వానికి మద్దతుగా పుతిన్ రష్యన్ దళాలను సిరియాకు పంపించారు. ఈ క్రమంలోనే సిరియా గడ్డపై ఐసిస్ సహా ఇతర ఉగ్రవాద గ్రూపులను అణిచివేయడమే లక్ష్యంగా పుతిన్ ఈ చర్యలు తీసుకున్నారు. పెట్టుకున్నాడు.


అంతేకాకుండా ముస్లింలను అణచివేసే దేశంగా రష్యాను ఐసిస్-కె చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే రష్యాపై ఐసిస్-కె దాడి చేయడానికి మరో కారణం అని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు.. ఐసిస్-కె టాప్ కమాండర్లలో ఆసియా నుంచి వచ్చిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు. వీరు కూడా రష్యాకు వ్యతిరేకంగా పోరాడున్నారు. ఇవన్నీ కలిపి రష్యా గడ్డపై ఇలాంటి ఉగ్రదాడులు చేయడానికి ఐసిస్-కె కు ఆజ్యం పోస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com