ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2 ఏళ్ల ముందే కేజ్రీవాల్ అరెస్ట్‌ను పసిగట్టిన జ్యోతిష్యుడు

international |  Suryaa Desk  | Published : Sat, Mar 23, 2024, 10:48 PM

రుద్ర కరణ్ పర్తాప్. ఈయన ఒక జ్యోతిష్యడు. మన తెలుగు రాష్ట్రాల్లో వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఎంత ఫేమస్ అనేది మనకు తెలుసు. అచ్చం వేణుస్వామి లాగే ఉత్తర భారతదేశంలో ఈ రుద్ర కరణ్ పర్తాప్ అనే జ్యోతిష్యుడు అంతే ఫేమస్. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనే డౌట్ వస్తుంది కదా. ఆగండి అక్కడికే వస్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురించి 2 ఏళ్ల క్రితం రుద్ర కరణ్ పర్తాప్ చెప్పిన జ్యోతిష్యం ప్రస్తుతం నిజం అవుతోంది. అరవింద్ కేజ్రీవాల్ చిక్కుల్లో పడతారని.. రుద్ర కరణ్ పర్తాప్ గతంలోనే అంచనా వేశారు.


ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో గతంలో రుద్ర కరణ్ పర్తాప్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఆ ట్వీట్‌ను ప్రస్తుతం రీట్వీట్ చేసిన రుద్ర కరణ్ పర్తాప్.. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సమస్యలు ఎదుర్కొంటారని 2022 లోనే రుద్ర కరణ్ పర్తాప్ తెలిపారు. 2022 మార్చి 25 వ తేదీన ట్వీట్ చేసిన రుద్ర కరణ్ పర్తాప్.. అరవింద్ కేజ్రీవాల్ చేసిన కర్మల ఫలితంగా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోతారని అంచనా వేశారు.


అప్పటి నుంచి ఆయన పతనం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అంతే కాకుండా 2024 లో కేజ్రీవాల్ న్యాయపరంగా అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని.. ఆయనకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరో తనకు తెలుసునని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ పేరును మాత్రం తర్వాత వెల్లడిస్తానని చెప్పారు. తాజాగా ఆ ట్వీట్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసిన రుద్ర కరణ్ పర్తాప్.. గతంలో అరవింద్ కేజ్రీవాల్ గురించి తాను చెప్పిందే నిజం అయిందని వెల్లడించారు. ఏ వ్యక్తి కూడా తమ కర్మ, గ్రహ శక్తుల ప్రభావం నుంచి తప్పించుకోలేరని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com