ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ,,,మార్చి 1న విశాఖకు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 10:23 PM

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖకు రానున్నట్లు తెలుస్తోంది. రూ.26 వేల కోట్ల ఖర్చుతో నవీకరించిన హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రిఫైనరీతో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఏయూ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.


విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ను ప్రధాని మోదీ ఈ నెల 26న ‘వర్చువల్‌’గా ప్రారంభిస్తారు. గతంలో దీనికి ఉన్న ప్రాంతీయ ఫుడ్‌ ల్యాబొరేటరీ హోదాను కేంద్రం రూ.4.5 కోట్లతో రాష్ట్ర స్థాయికి పెంచింది. అత్యాధునిక పరికరాల కోసం రూ.14 కోట్లను కేటాయించి.. ఇప్పటికే రూ.8 కోట్లను మంజూరు చేసింది. పూర్తిస్థాయిలో పరికరాలు, యంత్రాలు సమకూరితే ఏడాదికి సుమారు 20 వేల ఆహారం, నీటి నమూనాలను పరీక్షించేందుకు వీలు ఏర్పడుతుంది. దీంతో పాటు ప్రభుత్వానికి అదనంగా ఆదాయమూ సమకూరుతుంది.


మరోవైపు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రాంగణంలో, తిరుపతిలోని టీటీడీ భవనంలోనూ రాష్ట్ర స్థాయి ల్యాబ్‌ల ఏర్పాటుకు రూ.18 కోట్ల చొప్పున విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2.07 కోట్లతో తీసుకువచ్చిన నాలుగు ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌ ల్యాబ్‌లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com