ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐటీ అధికారులమని బంగారం వ్యాపారి కారు ఆపారు.. సీన్ కట్ చేస్తే దిమ్మ తిరిగే ట్విస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 10:14 PM

తూర్పుగోదావరి జిల్లాలో దారి దోపిడీ కలకలంరేపింది. ఆదాయ పన్ను శాఖ అధికారులమని చెప్పి.. కారును తనిఖీ చేయాలని చెప్పారు. నగల వ్యాపారి దగ్గరున్న బంగారం, డబ్బులతో ఉడాయించారు. నల్లజర్ల మండలం పోతవరం శివారులో ఈ ఘటన జరిగింది. మహారాష్ట్ర నుంచి 25 ఏళ్ల క్రితం కిందట వలసవచ్చిన గార్లె బాలు నాధూరాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో స్థిరపడ్డారు.. అక్కడే బంగారం వ్యాపారం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సహా పలు ప్రాంతాల్లోని షాపుల్లో హోల్‌సేల్‌ ధరలకు బంగారం విక్రయిస్తుంటారు.


బాలు భీమవరం నుంచి కారులో డ్రైవరుతో పాటు బయల్దేరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక షాపులో బంగారం ఇచ్చి కొయ్యలగూడెం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. నల్లజర్ల మండలం పోతవరం శివారుకు వచ్చేసరికి కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు.. తాము ఐటీ ( ఆదాయపు పన్ను) విభాగం అధికారులమంటూ వ్యాపారి కారును అడ్డగించారు. వ్యాపారిని, డ్రైవరును తమ కారులో ఎక్కించుకొని.. నాదూరాం కారును ఆ ఐదుగురిలో ఒకరు నడిపారు. వీరు హైవేపై కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్‌ వరకు వచ్చారు.


అక్కడ రాత్రి 9 గంటల సమయంలో వ్యాపారిని, డ్రైవరును విడిచిపెట్టి, దుండగులు తాము వచ్చిన వాహనంలో వెళ్లిపోయారు. వ్యాపారి తన కారును తనిఖీ చేయగా బంగారం, డబ్బులు లేవు. వచ్చింది నకిలీ అధికారులని గుర్తించి తొలుత కొయ్యలగూడెం పోలీసు స్టేషన్‌లో, తర్వాత నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఆ గ్యాంగ్ మూడున్నర కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పారిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com