ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆర్టీసీ డ్రైవర్ మామూలోడు కాదుగా.. టికెట్ల డబ్బులు తెలివిగా నొక్కేస్తూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 09:29 PM

ఆర్టీసీ అద్దె ప్రాతిపదికన తిరుపతి- కడప- తిరుపతి మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడుస్తోంది. ఈ క్రమంలో ఈ బస్సును ఆపి అధికారులు తనిఖీ చేశారు. ఈ నెల 17న కడప జిల్లా కుక్కలదొడ్డి దగ్గర తనిఖీ చేశారు. ప్రయాణికుల టిక్కెట్లపై అనుమానం వచ్చి, టిమ్‌ను తనిఖీ చేయగా, అసలు విషయం బయటపడింది. టిమ్స్‌లో వినియోగించే పేపర్‌ రోల్‌పై డీటీపీ ద్వారా వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో ముద్రించిన నకిలీ టిక్కెట్లను ప్రయాణికులకు అందిస్తూ తనిఖీ అధికారులకు పట్టుబడ్డాడు. రైల్వే కోడూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.


ఆర్టీసీ టిక్కెట్లను కండక్టర్లు స్వయంగా ముద్రించి ప్రయాణికులకు అందిస్తూ చేతివాటం ప్రదర్శించడంతో.. ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల నగదు రహిత లావాదేవీలు చేసే విధంగా (యూటీఎస్‌) మిషన్లు అందుబాటులో ఉంచిది. ఇటువంటి కంప్యూటరైజ్డ్‌ ఎలక్ట్రిక్‌ మిషన్‌ను ప్రైవేట్‌ సంస్థకు చెందిన డ్రైవర్‌ గోపీ దుర్వినియోగం చేస్తూ చేతివాటం ప్రదర్శించాడు. ఘటన ఆలస్యంగా బయటపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com