ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదాద్రి శ్రీవారికి సహస్రనామార్చన

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Feb 07, 2024, 03:51 PM

యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి స్వామి సన్నిధిలో బుధవారం ఉదయం సుప్రభాత సేవ నిజాభిషేకం అనంతరం సహస్రనామార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంటలపాటు అర్చన పర్వాలు కొనసాగాయి. ఇందులో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి బుధవారం ఉదయం నిత్య నిజాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం పాలు, పెరుగు, పంచదార పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో నిజాభిషేకం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళ నీరాజనాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com