ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయ్,,,,గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన విష్ణుదేవ్

national |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2023, 09:16 PM

వారం రోజుల సస్పె్న్ష్‌కు బీజేపీ అధిష్టానం తెరదించింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ను బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. సీఎం ఏంపిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు బీజేపే శాసనసభాపక్షనేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. విష్ణుదేవ్‌ సాయ్ గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. మరోవైపు ఛత్తీస్‌గడ్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ను పక్కనబెడుతూ.. కొత్త వ్యక్తి వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది.


అంతకుముందు బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేలు‌ రాయ్‍పూర్‌లో సమావేశమయ్యారు. వీరితో కేంద్రమంత్రులు అర్జున్ ముండా, సర్భానంద సోనోవాల్, పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్, ఛత్తీస్‌గడ్ బీజేపీ ఇంఛార్జ్ ఓమ్ మాథూర్, మరో కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ శాసనసభాపక్ష నేతగా విష్ణుదేవ్ సాయ్‌ను ఎన్నుకున్నారు. 59 ఏళ్ల విష్ణుదేవ్ సాయ్ ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లోని కున్‌కురీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో బీజేపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయగా.. ఇందులో విష్ణుదేవ్ సాయ్ కీలకపాత్ర పోషించారు. విష్ణుదేవ్ సాయ్‌.. సాహు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాగా.. దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్ పూర్ డివిజన్లలో ఈవర్గం జనాభా అధికంగా ఉంది. మరోవైపు విష్ణుదేవ్ సాయ్ గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు.రాయ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి 1999 నుంచి 2014 వరకూ నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు మూడుసార్లు ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షునిగా ఉన్నారు.


ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2018లో 68 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి 35 సీట్లకు పరిమితమైంది. గోండ్వానా గణతంత్ర పార్టీకి ఒక సీటు వచ్చింది. అయితే శాసనసభ ఫలితాలు వెల్లడి అయ్యి వారం రోజులు కావస్తున్నా.. సీఎంను ఎంపికచేయలేకపోతున్నారటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే విష్ణుదేవ్ సాయ్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ అధిష్టానం. 2018 ఎన్నికల్లో గిరిజనులు అధికంగా ఉన్న సర్‌గుజా డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ డివిజన్‌లో ఉన్న 14 స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అయితే 2023 ఎన్నికల్లో విష్ణుదేవ్ సాయ్ ప్రభావంతో ఈసారి హస్తం పార్టీకి చుక్కెదురైంది. ఈ డివిజన్‌లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ జనాభాలో ఎస్టీల వాటా 32 శాతం కాగా.. బీజేపీ 29 సీట్లు కేటాయించింది. వాటిలో 17చోట్ల గెలుపొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com