ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదల్లో నుంచి బయటపడని చెన్నై.. మరోసారి అలర్ట్ చేసిన ఐఎండీ

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:17 PM

మిగ్‌జాం తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు తాకిడికి చెన్నై నగరంలోని చాలా ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో ప్రజలకు ఆహారం అందక, విద్యుత్ సౌకర్యం లేక నానావస్థలు పడుతున్నారు.
తుఫాన్‌ ప్రభావం బుధవారం నాటికి కాస్త తగ్గినా, ఇంకా నగరం వరద ముంపులోనే ఉంది. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ తాజాగా ప్రకటన చేసింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com