ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కస్టమర్‌లా నటించి అనంతపురంలోని జ్యువెలరీ షాపులో గొలుసు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 08:52 PM

అనంతపురంలో ఓ కిలాడీ లేడీ ఏకంగా ఓ పెద్ద జ్యువెలరీ షాపులో అందరి మధ్యలో ఓ ఆభరణాన్ని చోరీ చేసింది. కస్టమర్‌గా వచ్చి రోల్డ్‌గోల్డ్‌ చైన్ ఉంచి 32 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లింది. దాదాపు వారం తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన షాపు సిబ్బంది అవాక్కయ్యారు. గత నెల 28న ఓ మహిళ నగరంలోని సప్తగిరి సర్కిల్‌లోని గోల్డ్‌ షాపులోకి కస్టమర్‌గా వెళ్లింది. బంగారు ఆభరణాలు కొనే క్రమంలో 32 తులాల బంగారు గొలుసును తీసుకుంది. అక్కడే ఆమె ప్లాన్‌ను అమలు చేసింది. ఆ బంగారు గొలుసు స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ గొలుసును ఆ బాక్స్‌లో ఉంచి ఆ షాప్‌ నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఆ షాపుకు వచ్చిన ఓ కస్టమర్‌ ఆ రోల్డ్‌గోల్డ్‌ నగకు ఉన్న ట్యాగ్‌ తేడాగా ఉండటాన్ని గమనించి ఆ షాప్‌ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. సీసీ పుటేజీలను షాపు సిబ్బంది పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ సమీపంలో ఉన్న‌ గోల్డ్‌ షాపులో కూడా గత నెల 24న ఇదే తరహాలో ఓ బంగారు ఆభరణాన్ని ఓ మహిళ చోరీ చేసింది. ఈ రెండు ఆభరణాలనూ చోరీ చేసింది ఒకే మహిళగా గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా మహిళ గురించి ఆరా తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com