ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిందని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తు ముల అశోక్రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ‘బాబుతో నేను’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టారు. జగన్ ప్రభుత్వం అధిక ధరలు, దౌర్జన్యాలు, దోపిడీలతో, ఆర్థిక కుంభకోణాలతో అరాచక పాలన చేస్తుందని, సామాన్యుల తరఫున సమస్యలను ఎత్తి చూపిస్తున్న చంద్రబాబుపై రాజకీయ కక్షసాధింపు చర్యలతో అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ప్రజలకు తెలియజేసారు.