ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉండవల్లిలోని సీఎం నివాసంలో టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 09:50 PM

మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలోనే టీడీపీ కండువాను కప్పుకున్నారు. వారికి చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు ఉన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్న బీదా మస్తాన్ రావు 2019లో వైసీపీలో చేరారు. నాటి వైసీపీ ప్రభుత్వం 2022లో ఆయనను రాజ్యసభకు పంపించింది. మోపిదేవి వెంకటరమణ తొలుత కాంగ్రెస్‌లో ఉన్నారు. 2012లో వైసీపీలో చేరారు. ఇప్పుడు ఇరువురు టీడీపీ జెండా కప్పుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com