ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడొద్దన్న కొల్లు రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 10:17 PM

ఏపీలో మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్, ఆఫ్ లైన్లో షాపులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దరఖాస్తు రుసుమును రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 16 నాటికి కొత్త వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. మరోవైపు, షాపులను సొంతం చేసుకోవడానికి సిండికేట్లుగా ఏర్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతరులు టెండర్లు వేయకుండా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలకు తావివ్వొద్దని మంత్రి ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా షాపులను కేటాయించాలని చెప్పారు. దరఖాస్తు ప్రక్రియ, షాపుల కేటాయింపులు పారదర్శకంగా ఉండాలని అన్నారు. సిండికేట్లకు సహకరించే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారికి అధికారులు సహకరించాలని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com