ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల గణన చేపట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 10:52 AM

కుల గణనతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని బీసీ కుల గణన చేపట్టాలని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, ఎన్‌జీవోలు, రిటైర్డ్‌ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని, వారందరి సేవలు వినియోగించుకుంటూ కుల జనగణన జరపాలని కోరారు. అలానే  కులగణన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ  ఈ నెల 21న కదిరిలో బీసీల కుల గణనకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com