టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా తిరిగి రావాలని కాంక్షిస్తూ పలు ఆలయాల్లో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కృష్ణా జిల్ల్లా, జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలో బొడ్డురాయి వద్ద, గంగానమ్మ గుడిలో టీడీపీ శ్రేణులు మంగళవారం 101 కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట కమ్మటూరులో మహిళలు పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వేదాద్రి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నియోజకవర్గ టీడీపీ నేతలతో కలిసి రాత్రి నిద్ర చేశారు.