ఇంద్రకీలాద్రిపై రాజకీయ విమర్శలు చేయడాన్ని ధర్మకర్తల మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు ఖండించారు. జనసేన నేత పోతిన మహేష్ ఆలయ ప్రాంగణంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన ఖండిస్తూ... . అమ్మవారిని దర్శించుకున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇక్కడ రాజకీయ విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని సెలవిచ్చారు. దీని కోసం ఇతర వేదికలను ఉపయోగించుకోవాలన్నారు. ఉత్సవాల్లో ఏమైనా లోపాలు ఉంటే ధర్మకర్తల మండలికి చెప్తే సరి చేస్తామన్నారు. ఐతే జనసేన నేత పోటీనా మహేష్ మాట్లాడుతూ... ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపించడం లేదని విమర్శించారు. అంతరాలయంలో అమ్మవారికి పూల అలంకరణ చేయలేదని, ప్రధాన ఆలయ గోపురానికి ఉన్న బంగారు తాపడానికి కనీసం పాలిష్ చేయించలేదని ఆరోపించారు. ఉత్సవాల సందర్భంగా అంతరాలయంలో రంగులు వేయలేదన్నారు.వీఐపీలకు ఒక సమయాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. పోతిన మహేష్ ఇలా రాజకీయ విమర్శలు చేయడంతో దేవదాయ శాఖ, సమాచార శాఖ సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు అతడ్ని ఇక్కడ రాజకీయ విమర్శలు చేయవద్దంటూ లాక్కెళ్లిపోయారు.