ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూరంపాలెంలో పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 10:38 AM

నవంబరు 9 నుంచి 12 వరకూ సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ను ఏఐయూ సహకారంతో కాకినాడ , సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. రాజమహేంద్రవరంలోని అక్నూలో సౌత్‌జోన్‌ అంతర విశ్వవిద్యాలయ పురుషుల కబడ్డీ టోర్నమెంట్‌ బ్రోచర్‌ను ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్‌ కే.హేమచంద్రారెడ్డి, జేఎన్టీయూకే వీసీ జీవీఆర్‌ ప్రసాదరాజు, అక్నూ వీసీ కె.పద్మరాజు, ఆదిత్య వైస్‌ చైర్మన్‌ ఎన్‌.సతీష్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏపీఎస్సీహెచ్‌ఈ చైర్మన్‌ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.....  ఈ టోర్నమెంట్‌లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 100 విశ్వవిద్యాలయాల నుంచి 1200 మంది క్రీడాకారులు, 300 మంది అధికారులు, కోచ్‌లు హాజరవుతున్నారన్నారు. కార్యక్రమంలో అక్నూ రిజిస్ర్టార్‌ జి.సుధాకర్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com