అనంతపురం జిల్లా, పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళ్ళితే.... యాడికి మండలం తూట్రాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనంతపురంలో ఓ ఫంక్షనహాలులో వాచమెనగా పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం చంద్రశేఖర్ తన భార్యతో గొడవ పడి తాడిపత్రికి వెళుతున్నానని చెప్పి ద్విచక్రవాహనంలో బయలు దేరాడు. ముచ్చుకోట సమీపంలోకి రాగానే మలుపువద్ద బైక్ను అదుపుచేయలేక డివైడర్ను బలంగా ఢీకొనడంతో ఎగిరిపడి అక్కడి కక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.