రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ వైసీపీ నేతలు తాడేపల్లిలో సిద్ధం చేసిందేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఉండవల్లి వైసీపీ ఏజెంట్ అని, ఇప్పుడు ముసుగు తొలగించి జగన్కు సహకరిస్తున్నాడని చెప్పారు. స్కిల్ డెవల్పమెంట్లో అవినీతి అంటూ బురద జల్లుతూ ఉండవల్లి సీబీఐ విచారణ కోరారు. మరి లిక్కర్ విషయంలో ఎందుకు కోరలేదు? అని ప్రశ్నించారు.