తిరుమల శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన నేడు (బుధవారం) ఉదయం 8 గంటలకు కల్ప వృక్ష వాహనంపై భక్తులకు శ్రీనివాసుడు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7గంటలకు సర్వ భూపాల వాహనంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేతుడై మలయప్ప స్వామి కనువిందు చేయనున్నారు. కాగా.. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన మంగవారం రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.