ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబరు 11వ తేదీకి వాయిదా పడిన యార్లగడ్డ కేసు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 11:43 AM

లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా  గన్నవరం నియోజకవర్గం రంగన్నగూడెంలో గత నెల 24న చోటు చేసుకున్న ఘటనలో టీడీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావును అరెస్టు చేయొద్దనిహైకోర్టు ఆదేశించింది. విచారణను అక్టోబరు 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనలో ట్రయల్‌ కోర్టులో ఉపశమనం లభించకపోవడంతో తనపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టం, పలు ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ యార్లగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు రాగా న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com