ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న ప్రేమను గెలిపించే యత్నంలో తమ్ముడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 07:05 PM

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. అన్న ప్రేమను గెలిపించే ప్రయత్నంలో తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. బోగోలు మండలం కోవూరుపల్లి ఆకాశవంతెన వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరికి చెందిన కాకార్ల నాదమునికి.. రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన ఓ యువతితో ఏడాది కిందట ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. కొద్దిరోజులలకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో యువతికి తల్లిదండ్రులు వేరే పెళ్లి సంబంధం చూసి నిశ్చితార్థం చేయబోతున్నారని మునికి సమాచారం వచ్చింది.


యువతి తనను తీసుకెళ్లాలని నాదమునిని కోరింది. తాను రాలేనని.. తన తమ్ముడు దేవేంద్రను పంపిస్తున్నానని.. అతడితో వచ్చేయమని చెప్పారు. దేవేంద్ర నంబర్‌ ప్లేట్‌ లేని స్కూటీలో యువతిని తీసుకొని సొంత ఊరికి బయలుదేరాడు. మార్గమధ్యలో నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి దగ్గర హైవే సమీపంలో.. దేవేంద్ర నిద్రమత్తులో ఉండటంతో డివైడర్‌ను బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా..స్థానికులు గుర్తించి 108కు సమాచారం ఇచ్చారు. వాహనంలో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.. కానీ అప్పటికే దేవేంద్ర చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. యువతి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్న ప్రేమను గెలిపించేందుకు వెళ్లిన తమ్ముడు ఇలా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com