ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకానికి ఒప్పందం,,,తొలి దశలో 1400 ఎకరాలు విక్రయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 06:55 PM

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన భూముల విక్రయం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ భూముల విక్రయం ప్రక్రియ ప్రారంభించింది. స్టీల్‌ ప్లాంట్‌లోని నాన్‌ కోర్‌ ఆస్తుల అమ్మకానికి సంబంధించి త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదురింది. నేషనల్‌ ల్యాండ్‌ మోనటైజేషన్‌ కార్పొరేషన్, నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌, విశాఖపట్నం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ జనరల్‌ మేనేజర్‌ అమిత్‌ గుప్తా, ఎన్‌బీసీసీ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఆధీనంలో ప్రస్తుతం 19,703 ఎకరాల భూమి ఉందని ఉక్కు మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ భూముల వినియోగానికి సంబంధించి రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌తో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ పవర్‌ ఆఫ్‌ అటార్ని కలిగి ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది


ఈ ఒప్పందంలో భాగంగా తొలి దశలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన 1400 ఎకరాల భూములను విక్రయానికి పెట్టినట్టు సమాచారం. ‘ల్యాండ్‌ మోనటైజేషన్‌ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో భూముల అమ్మకం ప్రక్రియ కొనసాగుతుంది. వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌ భూముల విక్రయానికి సంబంధించి నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ సాంకేతిక, భూముల బదలాయింపు సలహాదారుగా వ్యవహరించనుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములను కొనుగోలు చేసేందుకు దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వీటిలో అదానీ గ్రూప్‌ కూడా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com