ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో రెండో రోజూ టీడీపీ నిరసన,,,,సభలో విజిల్స్ వేసిన బాలయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 07:04 PM

ఏపీ అసెంబ్లీ రెండ రోజు కూడా వాడీవేడిగా మొదలైంది. సభ ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సైకో పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు మండిపడ్డారు.


సభలో నిరసన తెలిపేందుకు కొన్ని విధానాలు ఉంటాయని.. సీఎం జగన్‌, పాలన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు.. అయినా టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించారు. ప్లకార్డులను వారి దగ్గర నుంచి తీసుకోవాలని స్పీకర్‌ను మంత్రి జోగి రమేష్ కోరారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.


ఏపీ అసెంబ్లీ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైనా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించగా.. వారి తీరుపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయిందని.. అవినీతి కేసులో అరెస్టై సైకో జైలులో ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో స్టేలతో చంద్రబాబు బతుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో వీడియోలు తీశారంటూ.. స్పీకర్ సభ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, బి. అశోక్‌లను ఈ సెషన్‌ మొత్తం సభ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్‌లను సస్పెండ్ చేశారు. అలాగే టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.


దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. పిరికిపందల్లా పారిపోవద్దని.. దేవాలయం లాంటి అసెంబ్లీని అవమానించడం సరికాదన్నారు. బజారు కూతలు కూస్తే ఊరుకునేది లేదన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్మును దోచేశారని.. టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరన్నారు. చిల్లర కోసమే విజిల్స్‌ వేస్తున్నారన్నారు. సభలో నందమూరి బాలయ్య విజిల్ వేయడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి పద్దతి సరికాదన్నారు. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. సభలో బాలయ్య తీరుపై మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు. తండ్రిని చంపిన చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలయ్య ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందే అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com