ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన, టీడీపీ కలయికతో వైసీపీ పతనం ప్రారంభమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:09 PM

స్కిల్‌లో స్కామ్‌ జరిగిందని జగన్‌ ప్రభుత్వం అక్రమం గా అరెస్టు చేసిన తర్వాత, జనసేనతో పొత్తు కుదిరాక చంద్రబాబుకు అనూహ్యంగా ప్రజాధరణ పెరిగిందని తాజాగా సీ ఓటర్‌ విడుదల చేసిన సర్వేలో వెల్లడైంది’’ అని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..... ‘‘చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ తర్వాత లోకేశ్‌ని అరెస్ట్‌ చేయడం ద్వారా ఆ పార్టీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేయాలని జగన్‌ భావిస్తున్నారు. ఈ కేసుల్లో విషయం లేదని న్యాయమూర్తులకు కూడా అర్థమయింది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకొని తెలంగాణతో పాటే, డిసెంబరులో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్‌ ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇప్పటికీ జగన్‌ చెప్పినట్లుగా నడుచుకుంటున్నావారికి భవిష్యత్తులో తిప్పలు తప్పవు అని హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com