మైదుకూరు లోని శ్రీ బాల శివ యోగేంద్ర మహారాజ్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ ఎస్ బి సురేష్ బాబు, వైస్ ప్రిన్సిపల్ రవి కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు భాష దినోత్సవం వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగు ఉపాధ్యాయుడు రవి కళ్యాణ్ మాట్లాడుతూ. తెలుగు భాషా దినోత్సవం ప్రతియేటా ఆగస్టు 29న అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటారని ఆయన అన్నారు.