ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు విస్తరణ పేరు తో ఆలయాలు తొలగించడం దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 02:53 PM

హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కడప నగర మాసాపేట లోని శ్రీరాముల గుడి, శివాలయం, మాతమ్మ గు డి కూల్చివేతల ప్రక్రియ ను నిలిపేయాలని బీజేపీ రాష్ట్ర నేత బాలకృష్ణయాద వ్‌ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం కలెక్టరు ఛాంబరులో ఆయనను కలిసి వినతిపత్రం అందించారు. మాసాపేటలో రోడ్డు విస్తరణ పేరుతో వందేళ్లకు పైగా గల శ్రీరాముల గుడి, శివాలయం, మాతమ్మ గుడులను కూల్చే దిశగా నగర కార్పొరేషన్‌ అధికారులు పూనుకోవడం సరికాదన్నారు. దళితులనే చిన్న చూపు తో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఆలయాల కూల్చివేతకు రంగం సిద్దం చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం చీ హిందువుల ఆలయాల కూల్చివేతకు యదేచ్ఛగా పాల్పడుతున్న సంగతి తెలిసిందేనన్నారు. ఆ క్రమంలో మాసాపేట దళితులను ఇబ్బందికి గురి చేసేలా పోలీసులను అడ్డుపెట్టుకుని ఆలయాలను కూల్చివేయడం మానుకోవాలన్నారు. కాదు, కూడదు.. అని కూ ల్చివేతకు సిద్దపడితే స్థానిక ప్రజలను ఏకంచేసి ఉద్యమానికి సన్నద్దం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ నేతలు కళ్యాణ్‌, విశ్వనాధ్‌, ప్రతాప్‌ తదితరులు కలెక్టర్‌తో కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com