శ్రీకాకుళం జిల్లా, రణస్థలం ప్రాంతంలోని యూబీ కార్మికులను తక్షణమే విధులోకి తీసుకొని, పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, టీడీపీ నేతలతో కలిసి డిమాండ్ చేశారు. గురువారం పరిశ్రమ గేటు ఎదురుగా కార్మిక కుటుంబాలతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నఫళంగా కార్మికులను పనిలో నుంచి తీసేయడం దారుణమన్నారు. సుమారు 600 కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.